
బారెడు పెంపు- జానెడు తగ్గింపు
-: ఇది మోడీ కనికట్టు- పెట్రో ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి
-: జలగలా జగన్ ప్రభుత్వం
– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ
కర్నూలు : పెట్రో ధరల విషయంలో బారెడు పెంపు- జానెడు తగ్గింపు ఇది మోడీ కనికట్టని, కేంద్ర ప్రభుత్వ వైఖరితో నే ప్రజానీకం సతమత మవు తుంటే జలగలా జగన్ ప్రభుత్వ వ్యవహారం ఉందని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ పేర్కొన్నారు. సోమ వారం కల్లూరు నంద్యాల చెక్పోస్టు సమీపంలో దామోదర సంజీవయ్య భవనంలో విలేఖరుల సమావేశం ఏర్పటు చేశారు. ఈ సందర్భగా లక్ష్మి నరసింహ మాట్లాడుతూ కేంద్ర ఎక్సజ్ సుంకం మా కాం గ్రెస్ పాలనలో లీటర్ పెట్రోల్ మీద రూ.9.8 పైసలు, డీజిల్ మీద రూ.3.56 పైసలు ఉండగా దీనిని మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద రూ.33.00 , డీజిల్ మీద రూ.31.83 పైసలు గా పెంచింద న్నారు. పెట్రోల్ మీద రూ.13 లు, డీజిల్ మీద రూ.16 లు తగ్గించిందని తెలిపారు. ఇప్పటి కీ కూడా కాంగ్రెస్ పాలన కంటే మోడీ పాలనలో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ పై రూ.10.50 లు, డీజిల్ పై రూ. 12 లు అధికంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అంతర్జా తీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ రేటు106 డాలర్ ఉన్నప్పుడు దేశంలో లీటర్ పెట్రోలు రూ.71 డీజిల్ రూ. 55 సరఫరా చేయగా, ప్రస్తుతం మోడీ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో చ మురు ధర 106డాలర్ల ఉం డగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటగా, జగన్ ప్రభుత్వం జలగలా రక్తం తాగుతుందని దుయ్య బట్టారు. వాట్ పెట్రోల్ పై 31 శాతం, డీజిల్ పై 22.25 శాతం అద నపు వాట్ లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.4 లు. రోడ్డు సెస్ లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.1 పర్యవసానంగా కర్ణాటక, తమి ళనాడు, ఒరిస్సా, తెలంగాణ, పుదుచ్చేరి ల కంటే అంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువే.



