
గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించిన గౌరు దంపతులు.
పాణ్యం , (SK1 NEWS HD) :
పాణ్యం మండలంలోని భూపనపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సునీల్ కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడటంతో శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఉండడం జరిగింది. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ గౌరు చరితారెడ్డి మరియు నంద్యాల టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంక రెడ్డి గార్లు శాంతిరాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి బాధితుడు సునీల్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.



